మాటూర్ ఉపాధ్యాయులకు అంబేద్కర్ జాతీయ పురస్కారాలు

Published: Friday April 16, 2021

మధిర, ఏప్రిల్ 15, ప్రజాపాలన ప్రతినిధి : బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్బంగా "పుడమి సాహితీ వేదిక" నల్గొండ వారు జాతీయ స్థాయి ( తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ) లో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారిలో మధిర మండలంలోని మాటూర్ హైస్కూల్ కి చెందిన ఉపాధ్యాయులు శ్రీ వేము రాములు, శ్రీమతి చాంద్ బేగంలు సాహిత్య రంగంలో చేసిన సేవలకు జాతీయ పురస్కారాలు అందించటం జరిగింది. ఈ పురస్కారాలు 14.04.2021న నల్గొండ లోని తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి గెస్ట్ హౌస్ లో పుడమి సాహితీ వేదిక సంస్థ అధ్యక్షులు చిలుముల బాల్ రెడ్డి మరియు శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ గార్ల చేతుల మీదుగా రాములు, చాంద్ బేగం లకు అందించటం జరిగింది.పురస్కారాలు సాధించిన ఉపాధ్యాయులను పాఠశాల HM, ఉపాధ్యాయులు గ్రామస్తులు అభినందించారు...