రాయికల్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ . సంజయ్

Published: Monday March 28, 2022

రాయికల్, మార్చి 27;(ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ పట్టణంలో టి యు.ఎస్.ఐ.డి.సి .20 లక్షలు నిధుల తో సీసీ కెమెరాలు, పది లక్షల విలువగల రాయికల్ మున్సిపల్ బ్లేడ్ ట్రాక్టర్ ను జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్.కే.సంజయ్ కుమార్, జెడ్.పి.టి.సి అశ్విని జాదవ్, రాయికల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు లౌడియా సంధ్యారాణి సురేంద్ర నాయక్, వైస్ ప్రెసిడెంట్ మహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు లతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, రాయికల్ మున్సిపల్ కమిషనర్ గంగుల సంతోష్ కుమార్, పట్టణ కౌన్సిలర్లు సాయి కుమార్, కాంతం, హుస్సేన్, మొబిన్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఇంతియాజ్ నాయకులు పెండెల గణేష్ తదితర నాయకులు పాల్గొన్నారు