ఫోటోగ్రఫీ జిల్లా స్థాయి పోటీల్లో మధిరకి తృతీయ బహుమతి

Published: Saturday August 20, 2022
మధిర ఆగస్టు 19 ప్రజాపాలన ప్రతినిధి స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పలు  కార్యక్రమాల్లో అత్యంత ప్రథమ కనపరిచిన ఖమ్మం జిల్లా మధిర ఫోటోగ్రాఫర్  అంగడాల గోపినాధ్కి జిల్లాస్థాయిలో మూడో బహుమతి లభించింది. మధిరలో నిర్వహించిన భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో 75 అడుగుల జెండా పట్టుకుని నిర్వహించిన ర్యాలీ ఫోటోకి జిల్లా అధికారులు మూడో బహుమతిని అందజేశారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఖమ్మంలో నిర్వహిస్తున్న ఫోటోగ్రఫీ వేడుకలలో
ఖమ్మం మేయర్ నీరజ మరియు సుడా చైర్మన్ బచ్చు విజయ్  మరియు రాష్ట్ర ఫోటోగ్రాఫర్ యూనియన్ నాయకులు చేతులు మీదుగా అంగడాల గోపీనాథ్ అందించారు. గోపినాథ్ అవార్డు రావడం పట్ల మధిర ఫోటోగ్రాఫర్ల సంఘం అధ్యక్షురాలు అంగడాల పార్వతి పలువురు సీనియర్ ఫోటోగ్రాఫర్లు హర్షం వ్యక్తం చేశారు