శంకరపట్నం లో ఘనంగా అంబేద్కర్ జయంతి

Published: Saturday April 15, 2023

శంకరపట్నం ఏప్రిల్ 14 ప్రజాపాలన రిపోర్టర్:





కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో  శుక్రవారం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు గొట్టే అర్జున్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. మండల పరిధిలోని, అంబాలాపూర్, మొలంగూర్, కేశవపట్నం, తాడికల్ ,మక్త, గ్రామాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎస్సీ బీసీ కాలనీ చిన్నారులు అంబేద్కర్ ప్రతిమను చేత పట్టుకొని ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తాకు చేరుకొని ఫ్లక్కాడ్లతో నినాదాలు చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలిచారు. అనంతరం చిన్నారుల చేత కేక్ కట్  చేయించి చిన్నారులకు పంపిణీ చేశారు. కేశవపట్నం 14వ వార్డు సభ్యుడు పిల్లి సమ్మయ్య పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, టీపిసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బండారి తిరుపతి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గరిగే ప్రభాకర్, బిజెపి జిల్లా నాయకులు మాడ వెంకటరెడ్డి, అలివేలు సమ్మిరెడ్డి, మాల మహానాడు మండలాధ్యక్షుడు కత్తెరమళ్ళ కిష్టస్వామి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, బిజెపి మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్, సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య, బీఎస్పీ మండల ప్రధాన కార్యదర్శి ఎదురుగట్ల సంపత్, కాంగ్రెస్ గ్రామశాఖ అద్యక్షుడు మొలంగురి సదానందం, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు బొజ్జా చంద్రమౌళి, ఉప సర్పంచ్ గజ్జల్లి హనుమంతు, వార్డు సభ్యులు వంగ సత్యనారాయణ, బాడిషా శీను, న్యాలం వీరస్వామి, పురెళ్ళ ప్రశాంత్, కోఆప్షన్ సభ్యుడు గుర్రం రామస్వామి, నాయకులు దాసరపు నరేందర్, బిజిలి సారయ్య, బక్కీ రాజనర్సు, గోదారి లక్ష్మణ్, యూత్ సభ్యులు బక్కి అనిల్ కుమార్, బక్కి రాజు, సందీప్, ప్రణదీప్, ఈశ్వర్, నిశాంత్ తదితరులు పాల్గొన్నారు.