9 వ డివిజన్ లో ఆరు లక్షల వ్యయంతో డ్రైనేజీ పనులు

Published: Wednesday June 16, 2021
బాలపూర్, జూన్ 15, ప్రజాపాలన ప్రతినిధి : దశల వారీగా అభివృద్ధి జరుగుతుందని కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ కాలనీ వాసులతో పేర్కొన్నారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9 వ డివిజన్ కార్పొరేటర్ పెండ్యాల శివ పార్వతి నరసింహ్మ  ఆధ్వర్యంలో 6 లక్షణ వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ మంగళవారం నాడు కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి కలిసి ప్రజాప్రతినిధులతో ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్, డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ...... ప్రతి డివిజన్లో దిశల వారీగా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. కరోనా కష్టకాలం లైన అభివృద్ధి పనులు ఆగవని కాలనీ వాసులతో అన్నారు. స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ.... కార్పొరేషన్ నిధుల నుండి అభివృద్ధి పనులు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోమీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ కార్పోరేటర్లు కీసర గోవర్ధన్ రెడ్డి, భీమ్ రాజ్, కాలనీ వాసులు దుర్గయ్య, జగన్మోహన్ రావు, నాగేష్, శ్రీనివాస్ గౌడ్, ఆంజనేయులు, తదితరురులు, కాలనివాసులు పాల్గొన్నారు