డాక్టర్ ప్రీతి పార్థివదేహానికి నివాళులర్పించిన కార్పొరేటర్లు

Published: Tuesday February 28, 2023
మేడిపల్లి, ఫిబ్రవరి 27 (ప్రజాపాలన ప్రతినిధి)
బంజారా బిడ్డ డాక్టర్ ధరావత్ ప్రీతి నాయక్ మరణ వార్త తెలియగానే 
ఏఐబిఎస్ఎస్  రాష్ట్ర సెక్రెటరీ, జనగామ జిల్లా కోఆర్డినేటర్, బోడుప్పల్  కార్పొరేటర్ భూక్యా సుమన్, కార్పొరేటర్ సుభాష్ నాయక్ వెంటనే బయలుదేరి జనగామ
జిల్లా ఏఐబిఎస్ఎస్ అధ్యక్షులు వాసు నాయక్, కార్యవర్గ సభ్యులతో కలిసి మొండ్రాయి, గిర్ని బాయి తండాలో డాక్టర్ ప్రీతి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ప్రీతి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రీతీ కుటుంబ సభ్యులకు
 ఏఐబిఎస్ఎస్ అండగా ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాజేష్ నాయక్, బానోతు రవీందర్ నాయక్, నేతావత్ రవికుమార్, కిరణ్ నాయక్, జనగామ జిల్లా ఏఐబిఎస్ఎస్  ప్రధాన కార్యదర్శి బానోతు హరిలాల్ నాయక్, నరేష్ నాయక్, అజ్మీరా స్వామి నాయక్, 2వ వార్డు కౌన్సిలర్ వాంకుడోతు అనితా, దరావత్ కిమా తదితరులు పాల్గొన్నారు.