టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా కార్పొరేటర్ యుగంధర్ రెడ్డి ప్రచారం
Published: Wednesday October 19, 2022
మేడిపల్లి, అక్టోబర్ 18 (ప్రజాపాలన ప్రతినిధి)
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని 11వ డివిజన్ కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆరెగూడెం గ్రామంలో ఇంటింటా ప్రచారం చేస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను ఓటర్లకు అందజేస్తూ, కారు గుర్తుకు ఓటు వేేసి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి, రాజు రెడ్డి, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: