హరితహారంలో భాగంగా ఏసీబీ కార్యాలయంలో మొక్కలు నాటిన డీజిపి పూర్ణచంద్రరావు

Published: Thursday July 15, 2021
అమీర్ పేట్ జోన్ (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమం లో భాగంగా ఈ రోజు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) కార్యాలయంలో ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు తన మనవడు ఉద్ధవ్ కృష్ణ, ఎసిబి సిబ్బంది తో కలిసి మొక్కలు నాటారు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా తమ కార్యాలయంలో హరితహారం దిగ్విజయంగా కొనసాగిస్తున్నామని తెలిపారు... ఇక్కడ నాటిన ప్రతి మొక్కను సజీవంగా ఉంచేందుకు తమ సిబ్బంది కృషి చేస్తునందుకు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.