ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిది

Published: Tuesday June 15, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల కేంద్రంలో సోమవారం టిఆర్ఎస్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 72 మంది లభ్ది దారులకు రూ 27,63,500 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మండల పార్టీ అధ్యక్షులు డేగల పాండు యాదవ్ ఆయా గ్రామాల అధ్యక్షులకు సర్పంచ్ లకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భువనగిరి శాసన సభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు మామిల్ల రత్నయ్య, పైళ్ల మాల్లారెడ్డి, సర్పంచ్ లు వంగాల భిక్షపతి,అంజిరెడ్డి, ఎంపిటిసి మోటే నర్సింహా, యూత్ అధ్యక్షులు లింగస్వామి, పట్టణ అధ్యక్షులు రవీంద్ర, లింగస్వామి, దనుంజయ్, నర్సింహా, రాములు, కొండూరు వెంకటేష్, ప్రభాకర్, మరియు లభ్దిదారులు పాల్గొన్నారు.