శ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవం

Published: Monday May 09, 2022
వికారాబాద్ బ్యూరో 08 మే ప్రజాపాలన : శ్రీ భగీరథ మహర్షి జయంతి కార్యక్రమాన్ని ఆదివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరములో జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న బిసి కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ, ఎవరైనా కష్టపడి పట్టుదలతో అనుకున్నది సాధించే వారిని భగీరధునితో పోలుస్తారని, అలాగే ఎవరైనా కఠోర శ్రమ చేసి దేన్నైనా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశాడని కొనియాడుతారని ఈ సందర్బంగా భగీరథని చరిత్రను అయన కొనియాడారు. అయన ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదని, అయన ఆలోచన విధానాన్ని అందరు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ అధికారి ఉపేందర్, సహాయ అధికారి భీంరాజ్, జిల్లా బిసి సంఘం అధ్యక్షులు రవి, ఉపాధ్యక్షులు కృష్ణ, సభ్యులు యాదయ్య, మహేందర్ లతో పాటు  బిసి వసతి గృహ సంక్షేమ అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.