ఘనంగా పౌర హక్కుల దినోత్సవం

Published: Tuesday February 01, 2022

ఇబ్రహీంపట్నం, జనవరి 31 (ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ వద్ద పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో ఎస్సీ & ఎస్టి లపై జరిగే సాంఘిక దురాచారాలు అసమానతలు అంటరానితనం అస్పృశ్యత వంటి అంశాలపై అవగాహన కార్యక్రమంలో ఇట్టి అంశాలపై పలువురు మాట్లాడారు. డిప్యూటీ తహశీల్దార్ పద్మ పైఅంశాలపై మాట్లాడుతూ అందరూ సమానమే అని కుల విబేధాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని గ్రామంలో ఇటువంటివి ఏమైనా జరిగితే మా దృష్టికి తీసుకరావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ పద్మ, సర్పంచ్ నెరేళ్ల హేమలత, వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి ఆర్ ఐ భూమేష్ పంచాయతీ కార్యదర్శి రమేష్, వీఆర్వో నర్సయ్య మొండి కిరణ్ అంగన్వాడి, ఆశా కార్యకర్తలు, అంబేడ్కర్ సంఘం సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు..