భాగం రమాదేవి ప్రధమ వర్ధంతి కి హాజరైన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గ ప్ర

Published: Monday May 02, 2022
బోనకల్, మే 1 ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని గోవిందపురం (ఏ) గ్రామ సర్పంచ్ భాగం శ్రీనివాసరావు సతీమణి రమాదేవి ప్రధమ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ హాజరై రమాదేవి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ రమాదేవి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు. అనంతరం వరంగల్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సభకు బోనకల్ మండలం నుండి జన సమీకరణ ఎక్కువగా ఉండాలని నాయకులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వేమి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మండల జడ్పిటిసి మోదుగు సుధీర్ బాబు,మండల పార్టీ అధ్యక్షులు గాలి దుర్గారావు, మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్నాటి రామకోటేశ్వరరావు, బీసీ సెల్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కందుల పాపారావు, యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బద్రు నాయక్, ఎస్సీ సెల్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మారు పల్లి ప్రేమ్ ప్రేమ్ కుమార్, మంద అచ్చయ్య, మరీదు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.