హఫిజ్ పెట్ లో ఘనంగా జెండా పండుగ

Published: Friday September 03, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి :  తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సెప్టెంబర్ 2న దేశ రాజధాని ఢిల్లీ లో తెరాస పార్టీ కార్యాలయంనకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనే శుభసందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సూచన మేరకు తెరాస పార్టీ జెండా పండుగ సందర్భంగా గురువారం హఫిజ్ పెట్ 109 డివిజన్ పరిధిలోని తెరాస పార్టీ కార్యాలయం వద్ద తెరాస పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ, కార్పోరేటర్లు పూజిత జగదేశ్వర్ గౌడ్, పాల్గొని తెరాస పార్టీ జెండా ను ఎగరవేయడం జరిగింది. అనంతరం జీహెచ్ఎంసీ వర్కర్స్ కి ఆరెకపూడి గాంధీ చేతులు మీదగా బ్లాకేట్స్ పంపిణీ చైయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తెరాస మహిళ నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు.