భట్టి జన్మదిన సందర్భంగా పేదలకు బియ్యం కూరగాయల పంపిణీ..

Published: Wednesday June 16, 2021
పాలేరు, జూన్ 15 (ప్రజాపాలన ప్రతినిధి) : భట్టి జన్మదిన సందర్భంగా నేలకొండపల్లిలో పేదలకు బియ్యం, కూరగాయలను ఆయన అనుచరులు అందించారు.ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లిలో ఖమ్మం జిల్లా యువజన జిల్లా ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని ఆధ్వర్యంలో తెలంగాణ సీఎల్పీ నేత మధిర శాసనసభ సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా నేలకొండపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో పుట్టినరోజు కేక్ కట్ చేశారు. అనంతరం  నేలకొండపల్లి గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు, నిరుపేద వికలాంగులకు 80 మందికి బియ్యం, కూరగాయలు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకగా మల్లు భట్టి విక్రమార్క ఉన్నారన్నారు. కరోనా విపత్తు సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఆసుపత్రులను సందర్శిస్తూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ అసెంబ్లీలో ప్రశ్నించే గొంతైయ్యారన్నారు. రైతు సమస్యలు తెలిసిన భట్టియే అన్నారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ రాయపూడి నవీన్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ  ఎస్సీ సెల్ అధ్యక్షుడు నేలకొండపల్లి ఎంపీటీసీ బొడ్డు బొందయ్య, నేలకొండపల్లి ఎంపీటీసీ దోసపాటి కల్పన, నేలకొండపల్లి మాజీ సర్పంచ్ మామిడి వెంకన్న, కాంగ్రెస్ పార్టీ  పాలేరు నియోజకవర్గ సేవాదళ్ కన్వీనర్ బచ్చలకూరి  నాగరాజు, దోసపాటి శేఖర్, జెర్రిపోతుల. సత్యనారాయణ, నేలకొండపల్లి ఉప సర్పంచి లక్కం ఏడుకొండలు, కందిమల్ల హరి, భూక్య చిన్న నాయక్, గుడిబోయిన వెంకటేశ్వర్లు, రెడ్డిమల్ల బాబు రెడ్డి, చెరుకు రంగయ్య, చట్టు శీను, షేక్ కోటేశ్వరరావు, పగిడికత్తుల సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు