కోరుట్ల తహశీల్దార్ ను మర్యాద పూర్వకంగా కలిసిన జర్నలిస్ట్ మిత్రులు

Published: Wednesday March 09, 2022

కోరుట్ల, మార్చ్ 08 (ప్రజాపాలన ప్రతినిధి): కోరుట్ల తహశీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్.రాజేష్ ను మర్యాద పూర్వకంగా కలిసిన జర్నలిస్ట్ మిత్రులు, అనంతరం తహశీల్దార్ రాజేష్ కి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు కాశి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎండి ముకర్రం, మహమ్మద్ హుస్సేన్, ఇంద్రాల హరీష్, బాణాల శ్రీధర్ లు పాల్గొన్నారు.