స్వయం సహాయక డ్వాక్రా మహిళ సంఘాలకు కరోనా వాక్సిన్ పై అవగాహన పేంచాలి : కార్పోరేటర్ మంజుల రఘునా

Published: Friday June 18, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : చందానగర్ డివిజన్ పరిధిలోని మున్సిపల్ కళ్యాణ మండపంలో స్వయం సహాయక మహిళ సంఘాల వాక్సినేషన్ కార్యక్రమాన్ని చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వాక్సిన్ పై మహిళల అందరికి అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు... డివిజన్ లోనీ అన్ని మహిళల సంఘాలకు అపోహలు తోలగించి వాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కరోనా మహ్మమరి నియంత్రణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కరోనా వైరస్ వ్యాప్తి చేందకుండా ప్రభుత్వం కోన్ని రంగాల ప్రజలకు ప్రత్యేక  వాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేసి టికాలను వేయడం జరుగుతుందన్నారు. అధికారులు ప్రజలకు అవగాహన కల్పించి వాక్సినేషన్ కార్యక్రమానికి రాని మహిళ సంఘాలకు తప్పకుండా వాక్సిన్ వేయించాలన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని మహిళలు వాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గోని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, చందానగర్ మున్సిపల్ ప్రాజెక్టు అధికారి వత్సాలాదేవి, చందానగర్ లయన్స్ క్లబ్ ప్రసిడెంట్ పులిపాటి నాగరాజు, టిఆర్ఎస్ నాయకులు రవిందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.