పల్లెల్లో ముమ్మరంగా కాంగ్రెస్ సభ్యుత్వం....

Published: Monday January 31, 2022

ఎర్రుపాలెం జనవరి 30 ప్రజాపాలన ప్రతినిధి: ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో పిసిసి, సీఎల్పీ ఆదేశాలతో  మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయా గ్రామకాంగ్రెస్ కమిటీ మరియు బూత్ ఎన్ రోలర్స్ సమక్షంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీసభ్యుత్వాలు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది గ్రామాల్లో అన్నిరకాల ప్రజానీకం కాంగ్రెస్ సభ్యుత్వం తీసుకోవడానికి ముందుకొస్తున్నారు సభ్యుత్వం తీసుకున్న వారికి 2 లక్షల ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది. ఈరోజు మండలంలోని కొత్తపాలెం, రామాపురం, రేమిడిచర్ల, జమలాపురం, రాజుపాలెం, గట్లగౌరారం పంచాయతీ లలో మండల కాంగ్రెస్ అద్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఇంచార్జ్ పెండ్ర అంజయ్య, ఉపాధ్యక్షులు బండారు నరసింహారావు, పిఎసిఎస్ ఉపాధ్యక్షులు కడియం శ్రీను, షైక్ జానీభాషా, దేవరకొండ శ్రీను, కె రంగారావు, సర్పంచ్ బి వెంకటరెడ్డి, వెర్రి వెంకట్రావ్, నాయకులు చెన్నకేషవరవు, ఆత్మాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.