ఉప్పల్ డివిజన్లో రూ 84.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

Published: Tuesday December 06, 2022
మేడిపల్లి, డిసెంబర్ 5 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ డివిజన్లోని హనుమసాయి నగర్ కాలనీలో  పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మందముల రజితపరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.
హనుమసాయి నగర్లో  రూ 30 లక్షలతో భూగర్భ డ్రైనేజీ పనులను పూర్తి చేశారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణానికి                      కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి రూ.84.5లక్షల నిధులను మంజూరు చేయించి సోమవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తో కలిసి కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి  భూమి పూజ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప్పల్ మున్సిపల్      ఈఈ నాగేందర్, డిఈ నిఖిల్ రెడ్డి, జలమండలి మేనేజర్ సత్యనారాయణ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్,ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేముల సంతోష్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి మస్కా సుధాకర్, టీఆర్ఎస్ నాయకులు, టిఆర్ఎస్ నాయకులు టామ్ టామ్ వీరేశ్ ,అన్య వెంకటేష్,
 కాలనీ అధ్యక్షులు కంచెమీద సీను ,దుబ్బ లక్ష్మ రెడ్డి ,అన్వర్ ,శామీర్పేట్ హనుమంత్ రెడ్డి ,కట్ట కృష్ణ రెడ్డి ,జెట్ట కిషోర్ ,బోడిగా మల్లేష్ ,మంద మురళీకృష్ణ రెడ్డి ,శ్రీనివాస్ రెడ్డి ,మంద సుమన్ రెడ్డి ,శీను ,కట్ట వెంకట్ రెడ్డి ,కట్ట శ్రీశైలం ,రాధా ,మంజుల ,నర్సింహా రెడ్డి ,శివ రెడ్డి ,అనంత చారి ,శివ గౌడ్ ,గణేష్ ,శేఖర్ గుప్తా ,వెంకటేష్ ,తదితరులు పాల్గొన్నారు.