పారిశుద్ధ్య రహిత వార్డుగా తీర్చిదిద్దుతా : మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజు రమేష్

Published: Friday August 06, 2021
వికారాబాద్ బ్యూరో 05 ఆగస్ట్ ప్రజాపాలన : పారిశుద్ధ్య రహిత వార్డుగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్ అన్నారు. గురువారం మున్సిపల్ పరిధిలోని 25వ వార్డులో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. వార్డులో ఉన్న పెద్ద డ్రైనేజీ పరిశుభ్రత పనులను పర్యవేక్షించారు. ఓపెన్ ప్లాట్స్ లో ఉన్న పిచ్చి మొక్కలు తీయించారు. వార్డులో ఎక్కడ ఎలాంటి చెత్తా చెదారం లేకుండా శానిటేషన్ పనులు నిర్వహించామని పేర్కొన్నారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా జరుగుతున్న శానిటేషన్ పనులను ఛైర్ పర్సన్ దగ్గరుండి పర్యవేక్షించారు. తడి, పొడి చెత్త వేరు చేయాలని వార్డు ప్రజలకు మరోసారి అవగాహన కల్పించారు. పనుల నాణ్యత విషయంలో రాజీపడకూడదని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ నాగరాజు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.