కరోనా రోగులకు ఆహారం అందించిన వారిని అభినందించిన మంత్రి అజయ్ మల్లాద్రి
Published: Wednesday May 19, 2021
మధిర ప్రజా పాలన ప్రతినిధి 18వ తేదీ మల్లాది సేవా సమితి సేవలను అభినందించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కరోనా రోగులకు మల్లాది సేవా సమితి వ్యవస్థాపకులు మల్లాది వాసు ప్రతిరోజు ఆహారం అందించడం ఎంతో అభినందనీయమని, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. మధిర ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో మంగళవారం నూతనంగా ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్లో ఉన్న రోగులకు మల్లాది సేవా సమితి వ్యవస్థాపకులు మల్లాది వాసు ద్వారా ఉచితంగా అందించే ఆహారం సరఫరా కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత మల్లాది సేవా సమితి నిర్వాహకులు గూడెల్లి నాగరాజు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: