కందకంలోకి దూసుకు వెళ్ళిన బైక్ - వ్యక్తి మృతి

Published: Friday June 11, 2021
మధిర, జూన్ 10, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలంమధిర కృష్ణాజిల్లా నందిగామ మండలం మాగల్లు గ్రామ శివారు శ్రీ విధ్యా సిబియసిస్కూల్ సమీపంలో బైక్ ప్రమాదవశాత్తూ కందకంలోకి దూసుకు వెళ్ళి వ్యక్తి మృతి చెందాడు. సేకరించిన సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర పట్టణం యసి.కాలనీకి చెందిన కొత్తపల్లి వెంకటేశ్వర్లు (57), తండ్రి ఇంట్లో పాపారావు గల వ్యక్తి బుధవారం అర్ధరాత్రి దాటాక తన పనులు ముగించుకొని నందిగామ నుండి తెలంగాణ రాష్ట్రం మధిర వెళుతుండగా మాగల్లు గ్రామ శివారు శ్రీ విద్య సిబియసి స్కూల్  సమీపంలో బైక్ అదుపుతప్పి కందకంలోకి దూసుకువెళ్ళి కొత్తపల్లి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అక్కడి కక్కడే మృతి చెందాడు. ఉదయాన్నే సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని నందిగామ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమొదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.