నయనం ప్రధానం ఇదం శరీరం
Published: Saturday March 11, 2023
* శివారెడ్డిపెట్ పిఎసిఎస్ చైర్మన్ మసనగారి ముత్యంరెడ్డి
వికారాబాద్ బ్యూరో 10 మార్చి ప్రజాపాలన : శరీర అవయవాలలో కళ్ళు అతి ముఖ్యమైనవని శివారెడ్డిపేట్ చైర్మన్ మసనగారి ముత్యంరెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డులో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ మసన్న గారి మంజుల అధ్యక్షతన శివారెడ్డి పెట్ పిఎసిఎస్ చైర్మన్ మసనగారి ముత్యంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు కంటి సమస్యలతో బాధపడుతున్న వారు కంటి వెలుగు శిబిరానికి వచ్చి పరీక్షించుకోవాలని సూచించారు. మూడవ వార్డు కౌన్సిలర్ మసనగారి మంజుల మాట్లాడుతూ మూడవ వార్డులోని ప్రజలు కండ్ల సమస్యతో ఎవరు కూడా బాధపడరాదానే ఉద్దేశంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించామని స్పష్టం చేశారు. కండ్లను పరీక్షించుకున్న వ్యక్తులకు కళ్లద్దాలు మందులు కంటి శిబిరంలో పంపిణీ చేస్తున్నామని వివరించారు. దీర్ఘకాలికంగా కంటి జబ్బులతో బాధపడే వారు కంటి పరీక్షల అనంతరం మంచి వైద్య చికిత్స కొరకు తగు ఆసుపత్రికి వెళ్ళమని వైద్యులు సూచిస్తున్నారని తెలిపారు. కను గుడ్డుపై పొరలు ఏమైనా వచ్చినచో కంటిలో వేసే మందును అవసరమైన వారికి అందజేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ యువ నాయకుడు ఎన్నేపల్లి షఫీ ఎన్నేపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: