రావిర్యాల లో జరిగే దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా సభకు భారీగా తరలి రండి

Published: Tuesday August 17, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 16 ప్రజాపాలన ప్రతినిధి : ఈనెల 18వ తారీఖున మహేశ్వరం మండలం రావిర్యాల లో జరగబోయే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు నియోజకవర్గం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుండి లక్షలాది గా ప్రజలు తరలి రావాలని టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి కొత్త కుర్మా శివ కుమార్ పిలుపునిచ్చారు. ఇంద్రవెల్లి తరహాలో సభ జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలను విజయవంతం చేసేందుకు కార్యాచరణ జరిగిందన్నారు. ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు సైనికుల్లా పని చేసి సభను విజయవంతం చేసి టిఆర్ఎస్ పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా జనసమీకరణ  జరగాలని కోరారు.