మంత్రి సబితా ఇంద్రారెడ్డి జన్మదిన పురస్కరించుకొని 250 మందికి గ్లూకోస్ బాటిల్

Published: Thursday May 06, 2021
బాలపూర్, మే 5, ప్రజాపాలన ప్రతినిధి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన మహేశ్వరం నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్. బాలాపూర్ మండలం మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి గారి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని మీర్ పేట్ లేనిన్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో బుధవారం నాడు 250 మందికి  కోవిడ్ టెస్టుల కోసం వచ్చిన వారికి, వ్యాక్సినేషన్ కోసం వచ్చిన వారికి, గర్భిణీ స్త్రీలకు మంచినీళ్ళ బాటిల్ తో పాటు గ్లూకోస్ బాటిల్ లో ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ సిల్వరి సాంబశివ మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అర్కాల కామేష్ రెడ్డి, గంగుల శ్రీకాంత్ రెడ్డి, మహమ్మద్ సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.