ముళ్ళకంచెలతో మూసుకుపోయిన రహదారి

Published: Saturday April 01, 2023
మధిర, మార్చి 31 ప్రజా పాలన ప్రతినిధి:రెండు తెలుగు రాష్ట్ర లను అనుసంధానం చేసే రహదారి నేడు ముళ్ళ కంచేతో మూసుకుపోవడంతో ప్రయాణికులు, రైతులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మీనవోలు నుంచిమధిర మండలం తోండలగోపవరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఎన్. టి. అర్ జిల్లా వీరుల పాడు మండలం దొడ్డదేవర పాడు గ్రామాలను కలుపుతూ వేసిన రహదారి నేడు ముళ్ళ కంచే పెరగడం వల్ల రోడ్డు పై ప్రయాణించే వాహనదారులు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.. ఇటీవల ఈ రోడ్డుపై రెండు ద్విచక్ర వాహనాలు డీ కోవడం జరిగింది ఇప్పటికైనా రహదారుల శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ముళ్ళ కంచేను తొలగించగలరని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు..