ఆర్థిక సహాయం అందజేత

Published: Tuesday August 24, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిది మండల పరిధిలోని వెల్వర్తి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన కూచిమల్ల నర్సింగరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. నిరుపేద కుటుంబానికి చెందిన మృతుని కుటుంబ సభ్యులకు టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు తక్కళ్ళ సంజీవ 50 కేజీల బియ్యం, ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మృతుని భార్య నాగమణికి తన సొంత నిధుల నుండి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన నర్సింగరావు మృతితో వారి కుటుంబం వీధిన పడిందని, మానవతావాదులు ముందుకు వచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన అన్నారు. తన వంతు సహాయంగా ఈ చిన్ని సహాయాన్ని అందించానని భవిష్యత్తులో టిఆర్ఎస్ పార్టీ, స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా పిల్లల భవిష్యత్తు ను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ ఉక్కుర్తి స్వామి, వార్డు సభ్యలు భీమగాని వెంకటేశం, నాయకులు మల్లం సాలయ్య, బొమ్మ నరసింహ, కూచిమల్ల నాగేష్, కుశంగుల లక్ష్మయ్య, పరకాల దశరథ, పరకాల స్వామి, కూచిమల్ల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.