చలో ఢిల్లీ మాదిగల లొల్లి
Published: Wednesday December 08, 2021
బోనకల్, డిసెంబర్ 7 ప్రజాపాలన ప్రతినిధి: ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బోనకల్ జూనియర్ కళాశాల నందు కరపత్రం ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా జాతీయ ఉపాధ్యక్షులు లంకా వెంకటేశ్వర్లు మాదిగ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ బి సి డి ల వర్గీకరణ కోసం 20 ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం చేశామని, బిజెపి అధికారంలోకి వస్తే వందరోజుల్లో వర్గీకరణ చేస్తానని చెప్పి మాట తప్పారన్నారు.బిజెపి శీతాకాల సమావేశాల్లో ఏ బి సి డి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. దీనికై ఈనెల 13న చలో ఢిల్లీ మాదిగల లొల్లి ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో మండలాల వారీగా, గ్రామాల వారీగా ప్రతి మాదిగ బిడ్డ కంకణం కట్టుకొని, ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు నివ్వడం జరిగింది. అలాగే నియోజకవర్గ ఇంచార్జ్ గద్దల వేణు మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు పోరాటం ఆగదని అన్నారు. ఈ కార్యక్రమంలో బోనకల్ మండల నాయకులు మోదుగు రాము, ముదిగొండ మండల అధ్యక్షుడు కొత్తపల్లి నరసయ్య, చింతకాని మండల అధ్యక్షుడు దారెల్లి ధర్మయ్య, నాయకులు తోట ఈశ్వర్, మంద నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: