ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కృషి వల్ల రోడ్లు రావడం సంతోషం వ్యక్తం చేస్తున్న ఇబ్రహీంప
Published: Monday August 29, 2022
ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 28ప్రజాపాలన ప్రతినిధి
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుండి రోడ్డు విస్తీర్ణత జాలాగు పనులు మొదలుకొని పోల్కంపల్లి మీదుగా ఆక్టోపస్ వరకు పనులు వేగవంతంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చెరువతో సాగుతున్నాయి ఈ సందర్భంగా విలేకరుల తో టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు డేరంగుల నరసింహ మాట్లాడుతూ ఈ రోడ్డు పనులు 27 కోట్లు తో ఖర్చు పెట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎంతో కృషి తోటి పనిచేస్తూ రాత్రింబవళ్లు ప్రజల కోసమే ఎంతో శ్రమించి పనిచేస్తున్న ఎమ్మెల్యే గొప్పతనాన్ని నరసింహ కొనియాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి బాధ్యత తీసుకున్న తర్వాత పార్టీని మరింత ప్రతిష్ట చేసే విధంగా పనిచేస్తున్నాడని అదే కాకుండా నియోజకవర్గంలోని గ్రామల సమస్యలు పరిష్కరించే విధంగా శ్రమిస్తున్నారని దళితులకు దళిత బంధు రైతులకు రైతుబంధు మహిళలకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి లాంటివి పథకాలు మహిళలకు అందించి ఘనత ఎమ్మెల్యేకు దక్కిందని నరసింహ తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కొంగరకలాన్ లో కలెక్టరేట్ కార్యాలయం రావడం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. రోడ్డు విస్తీర్ణతను లో భాగంగా పోల్కంపల్లి గ్రామ ప్రజలు రవాణాకు రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇబ్రహీంపట్నంవరకు సునాయాసంగా వాహనాలకు పోగలుగుతాయని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా కాంట్రాక్టర్లు బాల్రెడ్డిని పనులు త్వరితగతిలో వేగవంతం జరపాలని మండల ఉపాధ్యక్షుడు డేరంగుల నరసింహ కోరారు,
Share this on your social network: