ధరణి రచ్చబండ లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు జువ్వాడి నర్సింగ రావు

Published: Thursday July 07, 2022
కోరుట్ల, జూలై 06 (ప్రజాపాలన ప్రతినిధి):
హైదరా బాద్ లోని ధర్నా చౌక్ ఇందిరా పార్కు లో  బుదవారం రోజున జరిగిన ధరణి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు , ఈ సందర్భంగా నర్సింగ్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం పెట్టిన ధరణి పోర్టల్ సామాన్య ప్రజలకు సమస్యలు తేవడం కోసం పెట్టినట్టు వుంది అని జువ్వాడి నర్సింగా రావు అన్నారు. ధరణి పోర్టుల్ మొదలు అయినప్పటి నుండి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ధరణి లో తప్పుల వల్ల అనేక గొడవలకు దారి తీస్తున్నవి అన్నారు. తప్పుల తడక గా ఉన్న ధరణి వెంటనే రద్దు చేసి పాత పద్దతిని కొనసాగిచాలని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్  రావు అన్నారు. నర్సింగ్ రావు తో పాటు ధర్నా లో టీపీసీసీ నేత జువ్వాడి  కృష్ణ రావు, జగిత్యాల జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు వాకిటి సత్యం రెడ్డి,  మాజీ జడ్పీటీసీ జలపతి రెడ్డి, జగిత్యాల జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు శశిథర్ రెడ్డి, తోట సంతోష్, పిడుగు తిరుపతి రెడ్డి, మల్లేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.