పెండింగ్లో ఉన్న పట్టాదారుని పాసుపుస్తకలు వెంటనే ఇవ్వాలి : సిపిఐ మండల కమిటీ
Published: Friday June 18, 2021
మధిర, జూన్ 18, ప్రజాపాలన ప్రతినిది : తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మధిర ప్రజాపాలన ప్రతినిధి 17వ తేదీ మున్సిపాలిటీAIDS సిపిఐ మధిర మండలం సమితి ఆధ్వర్యంలోపెండింగ్లో ఉన్న పాస్ బుక్కులను రైతాంగ సమస్యలు పరిష్కరించాలని మధిర తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం తాసిల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం AIKS మధిర మండల కార్యదర్శి చావా మురళి కృష్ణ సిపిఐ మధిర పట్టణ కార్యదర్శి బెజవాడ రవిబాబు గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలు సకాలంలో ఇవ్వకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అదేవిధంగా రైతు రుణమాఫీ అందరికీ సకాలంలో ఇవ్వాలి అని 58 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు 5వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు అందజేయాలని వ్యవసాయ శాఖ ద్వారా వ్యవసాయ యాంత్రికరణపరికరాలు సబ్సిడి ద్వారా ఆర్టికల్చర్ నుండి పండ్ల తోటలు సబ్సిడీపై రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మధిర మండల కార్యదర్శి వూట్ల కొండలరావు AISF ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్ CPI మండల కార్యవర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ తలారి రమేష్ మంగళగిరి రామాంజనేయ సిరివేరు శీను అక్ కొండ కొండూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: