10వ డివిజన్ లో వైకుంఠధామం పరిశుభ్రత

Published: Friday August 20, 2021
బాలాపూర్: ఆగస్టు19, ప్రజాపాలన ప్రతినిధి : పుట్టిన వాడు గిట్టక తప్పదునే... వైకుంఠధామం పరిశుభ్రంగా ఉంచడంలో స్థానిక కార్పొరేటర్ స్థానికులకు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నాడని కార్పొరేషన్ మేయర్ పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోకుర్ముల గూడా 10వ డివిజన్ కార్పొరేటర్ బొద్ర మోని రోహిణి రమేష్ ముదిరాజ్ ఆధ్వర్యములో స్మశాన వాటికకు వెళ్లే దారి లో పెండింగ్లో ఉన్న మిగతా సి సి రోడ్డు ను, భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేషన్ మేయర్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... స్థానికులకు ఏ సమస్యలన్న దగ్గరుండి చూసుకోవడం లో మీ స్థానిక కార్పొరేటర్. వైకుంఠధామం పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం సహకారాలు అందించి, పెండింగ్ పనులు కూడా పట్టుబట్టి పూర్తి చేస్తున్నారని అన్నారు. కార్పొరేషన్ లో ప్రతిదీ అభివృద్ధిగా ఉండాలని నా ఆకాంక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ చిగురంత పారిజాత నరసింహారెడ్డి, గ్రామ పెద్దలు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.