రాబోయే ఎన్నికల్లో కమలం వికసిస్తుందని అందెల

Published: Monday July 19, 2021
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన : సాయి గోకుల్ నివాస్ కాలనీవాసులు భాజపాలో స్వచ్ఛందంగా చేరారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్ పేర్కొన్నారు. బడంగ్ పేట కార్పొరేషన్ 1వ వార్డ్ సాయిగోకుల్ నివాస్ కాలనీ వాసులు బీజేపీలో స్వచ్ఛందంగా చేరారు. తెలంగాణ రాష్ట్ర ఓ బి సి సెల్ కన్వీనర్ నడికుడి యాదగిరి, కార్పొరేషన్ బీజేవైఎం అధ్యక్షులు రామకృష్ణా రెడ్డి ల ఆధ్వర్యంలో సాయి గోకుల్ కాలనీవాసులు బిజెపిలో ఆదివారంనాడు కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకు పల్లి వెంకటరెడ్డి లతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీరాములు యాదవ్ చేతుల మీదగా నాదర్ గుల్ బీజేపీ కార్యాలయంలో బిజెపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాషాయం కండువాలు కప్పుకున్న యువకులను భాజపా శ్రేణులు అందరూ అభినందించారు. అదేవిధంగా బీజేవైఎం బడంగ్ పేట్ కార్పొరేషన్ ఆర్ టి ఐ  కన్వీనర్గా సునిల్ కుమార్ కు నూతన పదవీ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా అందెల శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ...... పార్టీ కోసం పనిచేస్తే తప్పకుండా పదవులు వస్తాయని భవిష్యత్ దిశానిర్ధేశం పై ఆధారపడి ఉంటుందని శ్రీరాములు యాదవ్ అన్నారు. ప్రధాని నరేంద్రమోడీజీ, అమిత్ షాజీ, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నాయకత్వంలో కమలం వికాసిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి, పోరెడ్డి జగన్ మోహన్ రెడ్డి, చిత్రం శ్రీను, రాళ్లగుడెం ప్రశాంత్ రెడ్డి, మంత్రి మహేష్ ముదిరాజ్, లోకమ్, బీజేవైఎం యువ నాయకులు పెద్దబావి నాగనందీశ్వర్ రెడ్డి, భువనచందర్, రవికాంత్ గౌడ్ సహా కొత్తగా పార్టీలో చేరిన నరేష్, సతీష్ గౌడ్, తారకేష్, ఆంజనేయులు, రాజు, శివ, ఆశీస్, రాజు, మురళీ పాల్గొన్నారు.