గ్రంథాలయానికి కుర్చీల బహుకరణ

Published: Tuesday March 02, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయానికి పాఠకుల సౌకర్యార్థం మండల కేంద్రానికి చెందిన ప్రముఖ కిరాణా వ్యాపారి గజ్జెల వెంకటేశం సునీత సోమవారం ఐదు వేల రూపాయల విలువగల కుర్చీలను బహుకరించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అభివృద్ధి చైర్మన్ పబ్బు వెంకటరమణ గ్రంథాలయానికి కుర్చీలు అందజేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిట్టల ఆంజనేయులు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.