స్వతంత్ర సమరయోధులు పత్తేపురపు వెంకటేశ్వర్ల కు కాంగ్రెస్ పార్టీ ఘన నివాళి.

Published: Wednesday October 13, 2021
మధిర, అక్టోబర్ 12, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం ఇల్లూరు గ్రామం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు  పత్తేపురపు సంగయ్య తండ్రి వెంకటేశ్వర్లు వయస్సు106 స్వాతంత్ర్య సమరయోధులు తమరపత్ర  అవార్డు గ్రహీత ఈ రోజు  ఇల్లూరు గ్రామంలో తన స్వగృహంలో స్వర్గస్థులైనరు. ఈ విషయం తెలుసుకున్న సిఎల్పీ నేత మధిర శాసన సభ్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క వారి కుమారులతో చరవాణిలో జరిగిన సంఘటన గూర్చి తెలుసుకొని తీవ్ర దిగ్భ్రాంతి ని వ్యక్తపరిచారు దేశ భక్తి కలిగిన వెంకటేశ్వర్లు గారిని కోల్పోవటం పార్టీకి కుటుంభాన్నికి తీరని లోటని తెలిపారు అలాగే మండల కాంగ్రెస్ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ వెంకటేశ్వర్లు భౌతిక ఖాయం పై పార్టీ కండువా కప్పి పూలమాల వేసి నివాళులు అర్పించారు వెంకటేశ్వర్లు భార్య పదిమంది సంతానం కలదు వారి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ఓదార్పు ను కలుగ జేయలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సి సెల్ల్ అధ్యక్షులు ధారా బలరాజు మాజీ సర్పంచ్ కర్ణాటి రామారావు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవికుమార్ ఐ ఎన్ టియూసీ మండల అధ్యక్షుడు కోరంపల్లి చంటి మండల సెక్రెటరీ సూర్యదేవర కోటేశ్వరరావు ఆవుల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.