రావినూతల ఉన్నత పాఠశాలలో మాస్కుల వితరణ

Published: Tuesday September 07, 2021
బోనకల్లు, సెప్టెంబర్ 06, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్లు మండలం రావినూతల ఉన్నత పాఠశాలలో గురుపూజోత్సవం పురస్కరించుకొని లైన్స్ క్లబ్ ఆఫ్ స్తంభాద్రి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు మాస్క్ లను ఇవ్వడం జరిగింది లైన్స్ క్లబ్ సభ్యులైన శ్రీ మెడిశెట్టి మదన్మోహన్ శ్రీ గుంటుపల్లి దివాకర్ గుప్తా శ్రీమతి తేజస్విని మరియు రావినూతల ఉన్నత పాఠశాల హిందీ పండిట్ ఎండి గౌస్ ఉద్దీన్ ద్వారా మాస్క్ లను విద్యార్థులకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం శ్రీనివాసరావు కే సైదులు పి ఈ టి నారాయణ రావు విద్యార్థులు పాఠశాల సిబ్బంది లైన్స్ క్లబ్ ఆఫ్ స్తంభాద్రి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు