దళితులకు దళిత బంధు ప్రకటించినట్లే బిసి లకు బిసి బంద్ ప్రకటించాలి..వీరభద్రం..

Published: Monday June 13, 2022
పాలేరు జూన్ 12 ప్రజాపాలన ప్రతినిధి 
నేలకొండపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం  లో .. (బిసి సెల్ మండల అధ్యక్షులు గుడిబోయిన వెంకటేశ్వర్లు అధ్యక్షతన) జరిగిన విలేకరుల సమావేశంలో బిసి సెల్ జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల. వీరభద్రం మాట్లాడుతూ
రాష్ట్ర బడ్జెట్ లో బిసిలకు సగం వాటా కెటాయించాలి
బిసిలకు ఐదు వేల కోట్లు కెటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది.
దళితులకు దళిత బంధు ప్రకటించినట్లే బిసి లకు బిసి బంద్ ప్రకటించాలి
బిసిలకు బిసి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి
టిఆర్ఎస్ ప్రభుత్వం బిసిలపై కపట ప్రేమ చూపిస్తుంది
బిసిలకు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుంది బిసి ల సమస్యల పరిష్కారానికి త్వరలో కలెక్టరేట్ ముట్టడి
 
విలేకరుల సమావేశంలో పాల్గొన్న యస్.సి. సెల్ జిల్లా అధ్యక్షులు బొడ్డు. బొందయ్య, నేలకొండపల్లి సర్పంచి రాయపూడి నవీన్, మాజీ సర్పంచ్ మామిడి. వెంకన్న, ఉప సర్పంచి లక్కం ఏడు కొండలు,  పాలేరు సేవాదల్ కన్వీనర్ బచ్చలికూర నాగరాజు, మండల బిసి సెల్ నాయకులు, యడవల్లి నాగరాజు, రెడ్డిబోయిన నవీన్, అనంతు సత్యనారాయణ,  మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు యస్. కె. ఖాజామియా, మండల ఐయన్ టిసి అధ్యక్షుడు గోపి ఉపేందర్, యస్. సి. సెల్ నాయకులు తోళ్ల బుచ్చాలు, తదితరులు పాల్గొన్నారు.