ట్రైన్ లో నుంచి పడిన వ్యక్తి

Published: Wednesday November 24, 2021
మధిర నవంబర్ 23 ప్రజాపాలన ప్రతినిధి : ఉదయం తెల్లవారుజామున ఒక వ్యక్తి ట్రైన్ లో నుంచి ప్రమాదవశాత్తు జారిపడి దెందుకూరు గ్రామంలో పడిపోయినాడు. ఇతని వివరాలు ఇతని పేరు సంతోష్ మండల్ తన వయసు 20 సంవత్సరాలు ఇతను వరంగల్ నుండి గోరక్ పూర్ ఎక్స్ ప్రెస్ లో ఒరిస్సా వెళుతుండగా ప్రమాదవశాత్తు ట్రైన్ లో నుండి దెందుకూరు గ్రామం వద్ద పడిపోవడంతో అతనికి కుడిచెయ్యి విరిగిపోవడం జరిగింది. తలకి దెబ్బ తగలడంతో అతన్ని మధిర ప్రభుత్వ ఆసుపత్రి నుండి మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్లోలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గజ్జలకొండ శివ నాగేశ్వరరావు పైలెట్ నరసింహారావు అతనికి ప్రధమ చికిత్స అందిస్తూ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి GRP మరియుRPF ఇబ్బంది కలిసి తరలించడం జరిగింది. అక్కడ RPF ASI భాషా కి సెల్ ఫోన్ పర్సును 108 సిబ్బంది అందించడం జరిగింది.