ట్రైకార్ ద్వారా లబ్ది పొందేందుకు అవకాశం

Published: Thursday March 04, 2021

జిల్లా గిరిజన ఆర్థిక సహకార సంస్థ అధికారి కోటాజీ
వికారాబాద్ జిల్లా మార్చ్ 03 ( ప్రజాపాలన ప్రతినిధి ) : ట్రైకార్ ( జిల్లా గిరిజన ఆర్థిక సహకార సంస్థ పథకం ) ద్వారా లబ్ది పొందేందుకు గడువు పొడిగించబడినదని జిల్లా ట్రైకార్ అధికారి కోటాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లా గిరిజన ఆర్థిక సహకార సంస్థ వికారాబాద్ జిల్లా ద్వారా  గ్రామీణ పట్టణ ప్రాంత గిరిజనులకు 2020-21 సంవత్సరానికి గాను (213) యూనిట్లకు దరఖాస్తు చేసుకునే గడువు పొడిగించనైనదని వివరించారు. గిరిజనులకు వ్యవసాయ సంబంధ పశు సంవర్ధక చిన్న నీటి పారుదల చిరు వ్యాపారం మొదలగు  పథకముల కొరకు జిల్లా గిరిజన ఆర్థిక సహకార సంస్థ పథకం (ట్రై కార్ ) ద్వారా లబ్ది పొందుటకుగాను ఆన్ లైన్ www. tsobmms. cgg.gov.in ద్వారా 28 ఫిబ్రవరి 2021 నుండి 15 మార్చ్ 2021 వరకు పొడిగించడం జరిగిందని పేర్కొన్నారు. కావున అర్హులైన గిరిజన లబ్దిదారులు 15 మార్చ్ 2021 వరకు దారఖాస్తు చేసుకోగలరని కోరారు.