ఇంటర్ సప్లమెంటరీ ఫీజు గడువు పెంపు ** డిఐఈఓ శ్రీధర్ సుమన్ **

Published: Thursday July 07, 2022

ఆసిఫాబాద్ జిల్లా జులై 06(ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ, సం, పరీక్షలో ఫెయిలైన విద్యార్థులు, ఇంప్రూవ్ మెంట్ కు దరఖాస్తు చేసుకునే వారికి ఈనెల 8 వరకు గడువు పెంచినట్లు మాధ్యమిక విద్య అధికారి (డిఐఈఓ) శ్రీధర్ సుమన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫీజుల వివరాలు గతములో తెలిపినట్లుగా వార్షిక పరీక్ష ఫీజు 490 /-, ప్రాక్టికల్ ఫీజు 200 /-, బ్రిడ్జి కోర్సు ఫీజు 150 /-, చెల్లించాలన్నారు. ఆయా కళాశాలల ప్రిన్స్ పాళ్లు విద్యార్థులకు  సమాచారం అందజేసి సకాలంలో ఫీజులు చెల్లించాలని ఆదేశించారు.