ఆస్పత్రిలో సిమెంట్ బెంచీలు బహుకరణ

Published: Tuesday October 12, 2021

యాదాద్రి, అక్టోబర్ 11, ప్రజాపాలన ప్రతినిధి : వలిగొండ మండల పరిధిలోని వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో రోగులకు సేద తీరడానికి సోమవారం వైద్యాధికారి డాక్టర్ సుమన్ కళ్యాణ్ వారి తండ్రి కీ.శే.మువ్వ శ్రీరాములు మామ కీ.శే.దేవినేని భద్రయ్య జ్ఞాపకార్థం మరియు వేముల కొండకు చెందిన స్థానిక నాయకులు కేసిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి తన కొడుకు కేసిరెడ్డి రాజా నరసింహరెడ్డి జ్ఞాపకార్థం మొత్తం 20 వేల విలువైన సిమెంట్ బెంచీలను ఆసుపత్రికి బహూకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రామయ్య, డాక్టర్ సుమన్ కళ్యాణ్, ఆరోగ్య పర్యవేక్షకులు నాశబోయిన నరసింహ, ఫార్మసిస్ట్ శ్రీనివాస్, జే.సత్తయ్య, వినోద, అనిత, వినోద్ కుమార్, చరణ్, సతీష్, బ్రహ్మచారి, శ్రీదేవి, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు.