రాజకీయాలకతీతంగా ఆర్థికసాయం పంపిణీజడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Friday November 04, 2022

మధిర రూరల్ నవంబర్ 3 (ప్రజాపాలన ప్రతినిధి) రాజకీయాలకతీతంగా పేద ప్రజలందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సిఫారసు మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను గురువారం ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేకమంది పేదలు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. బోనకల్లు మధిర మండలాల్లో దరఖాస్తు చేసుకున్న పేదలకు మంజూరైన 2 లక్షల 16 వేల  రూపాయల  విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ఒకవైపు అభివృద్ధి పథంలో నడిపిస్తూ, మరోవైపు పార్టీకి పట్టుగొమ్మలుగా ఉండి నిరంతరం సైనికుల్లా పని చేస్తున్నవారికి అండగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. మధిరను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. వివిధ జబ్బులతో ఆస్పత్రిలో చేరి మెరుగైన వైద్యం చేయించుకునేందుకు అప్పుచేసి వైద్యం చేసుకున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో భరోసా కల్పించిందన్నారు. నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ టిఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు కనుమూరి వెంకటేశ్వరావు, సోషల్ మీడియా మధిర నియోజకవర్గ ఇన్చార్జి తాళ్లూరి హరీష్ బాబు, వై.వి అప్పారావు, జెవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.