ఏపీజీవీబీ బ్యాంకు ఆధ్వర్యంలో కళాజాతర కార్యక్రమం

Published: Thursday November 03, 2022

బోనకల్, అక్టోబర్ 2 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో నాబార్డ్ వారి ఆర్థిక సహాయంతో, బోనకల్ ఏపీజీవీబీ బ్యాంకు ఆధ్వర్యంలో కళా జాతర, బ్యాంకు లావా దేవి ల గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. బ్యాంకు మేనేజర్ సీతారాములు మాట్లాడుతూ: బ్యాంకు లో డిపాజిట్లు చేయుట వలన వికాస్ 666 లపై 7.10%, 999 లపై 7.50% వడ్డీ రేట్లు ఇవ్వడం గురించి, బ్యాంకు ఇన్సూరెన్స్ అయిన ప్రధానమంత్రి సురక్ష బీమా 20/-, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా 436/-, ప్రమాద బీమా 1000 లపాలసీలపై అవగాహన కల్పించట, మొబైల్ ద్వారా వచ్చే ఓటిపి మోసాల గురించి, దిశ మొబైల్ యాప్ ద్వారా 18 సంవత్సరాలు పైబడిన వారికి ఏపీజీబీ బ్యాంక్ అకౌంట్ ను ఫోన్లోనే క్రియేట్ చేయడం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఎఫ్ ఐ గిరిబాబు, కాలేజీ ప్రిన్సిపాల్ నళిని, లెక్చరర్స్, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.