ఏప్రిల్ 10 న అమీర్ పేటలో అంగరంగ వైభవంగా శ్రీరామ కళ్యాణం : ఆకుల విజయ.

Published: Wednesday April 06, 2022
హైదరాబాద్(ప్రజాపాలన ప్రతినిధి) : అమీర్ పేటలో ఏప్రిల్ 10న స్థానిక గురు గోవింద్ స్టేడియంలో శ్రీ రాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించ నున్నట్లు తెలిపారు నేషనల్ బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, కర్ణాటక రాష్ట్ర మహిళా మోర్చా ఇంచార్జ్, సనత్ నగర్ సీతారాముల కళ్యాణ మహోత్సవ కమిటీ నాయకురాలు ఆకుల విజయ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శివ స్వామి హాజరవనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పెద్దల వలన రామ మందిరం కల సాకారం అయ్యిందని, తాను ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల సమయంలో పర్యటించానని శ్రీరాముణ్ణి దేశం యావత్తు ఎంతగా పూజిస్తుందో ఉత్తరప్రదేశ్ లో పర్యటిస్తే తెలుస్తుందన్నారు. నూతన వధూవరులు ఈ సీతారాముల వారి కళ్యాణం కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కళ్యాణంలో పాల్గొనదలచిన వారు ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీర్ పేట్ కార్పొరేటర్ కేతినేని సరళ, బీజేపీ సీనియర్ నాయకులు చరణ్ సింగ్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.