శానిటైజర్లు,మాస్కులు పంపిణి చేసిన బీజేపీ నేతలు
Published: Tuesday June 01, 2021
బొల్లారం, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపల్ వైస్సార్ కాలనిలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పెళ్లి రోజు సందర్బంగా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డి.స్రవంతి నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మహిళ మోర్చా అధ్యక్షురాలు టీ.మేఘన రవీందర్ రెడ్డి చేతుల మీదుగా శానిటైజర్ మరియు మాస్కులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు టీ. రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు కే. లక్ష్మణ్ స్వామి, బి.రాజు, నరసింహ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: