*సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్డిఓ ను కలసి వినతి పత్రం అందజేశారు * *రైతులకు పట్టా పాస్ బుక్కులు

Published: Tuesday September 06, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 4 ప్రజాపాలన ప్రతినిధి.అబ్దుల్లాపూర్మెట్ మండలం బలిజగూడ గ్రామంలో సర్వేనెంబర్ 55,56లో పట్టా సర్టిఫికెట్ ఉండి సాగు చేసుకుంటున్నా రైతులకి పాసు బుక్కులు ఇచ్చి, రైతుబంధు అవకాశం కల్పించాలని. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ రైతులతో ఇబ్రహీంపట్నం ఆర్డిఓ గారికి మేమో రాండం ఇవ్వడం జరిగింది, బలిజగూడ గ్రామంలో గత 70 సంవత్సరాలుగా తాతల నుండి ఇట్టి భూమిలో సాగు చేసుకుని బోరు బావులు తోవి, రాళ్లు ,వంపు గడ్డలు, లక్షల రూపాయలు పెట్టి చదును చేసుకొని పంటలు పండించుకుని, ఈ భూమి జీవనార్ధంగా బతుకుతున్న రైతులకి పాస్ బుక్కులు, ఇవ్వాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఇ, నర్సింహ కోరారు. ఈ కార్యక్రమంలో, రాములు, ఆరుట్ల ముత్యాలు, మేడి వెంకటేశ్వర్, విరిగి బాబు, ఉప్పు శివకుమార్, పడకంటి జ్ఞానేశ్వర్, ఆర్ డి ఓ గారిని కలిసి పాసుబుక్కులు ఇవ్వాలని కలవడం జరిగింది.