ట్రెజరరీ ఉద్యోగుల అధ్యక్షుడిగా గంగుల పురుషోత్తం రెడ్డి... హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):

Published: Wednesday December 21, 2022

తెలంగాణ ట్రెజరీ, అకౌంట్స్ గెజిటెడ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా గంగుల పురుషోత్తం రెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం రాత్రి నిర్వహించిన ఎన్నికల్లో పురుషోత్తం రెడ్డి సమీప ప్రత్యర్థి పై ప్రదీప్ కుమార్ పై 30 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఫలితాలను ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లు సోమవారం విడుదల చేశారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పురుషోత్తమ రెడ్డి ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఎస్ టివోగా గంగుల పురుషోత్తమ రెడ్డి పనిచేస్తున్నారు.సహా అధ్యక్షుడిగా శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా పరుశ రామ్ తో పాటు ఆరుగురు అధ్యక్షులు, ఐదుగురు కార్యదర్శులతో పాటు ఇతర కార్యవర్గం ఎన్నికైంది ఈ సందర్భంగా పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి నేను అండగా నిలబడతానని ఆయన అన్నారు.