నల్లవల్లి లో హరితహారం

Published: Wednesday July 07, 2021
గుమ్మడిదల, జులై 06, ప్రజాపాలన ప్రతినిధి : గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా జడ్పిటిసి కుమార్ గౌడ్, ఎంపీపీ సద్ది ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి హాజరయ్యారు, ఈ సందర్భంగా జడ్పిటిసి కుమార్ గౌడ్, ఎంపీపీ సద్ది ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, సర్పంచ్ శంకర్, గ్రామస్తులతో కలిసి ఖాళీ ప్రదేశాల్లో హరితహారం మొక్కలు నాటారు. వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని పెంపొందించేలా గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని జడ్పిటిసి, ఎంపీపీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మహిళలు గ్రామస్తులు తదితరులు  పాల్గొన్నారు.