*ఘనంగా మాస్టర్ కీ టీవీ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ*
చేవెళ్ల జనవరి 1,(ప్రజాపాలన):-
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రం లోని అంబేడ్కర్ భవన్లో మాస్టర్ కీ టీవీ ఛానల్ నూతన క్యాలెండర్ ను చేవెళ్ల జడ్ పి టీ సి మాలతి కృష్ణా రెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి,చేవెళ్ల సర్పంచ్ శైలజా ఆగిరెడ్డి, దళిత రత్న అవార్డ్ గ్రహీత బురాన్ ప్రభాకర్, చేవెళ్ల కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు దేవర సమత వెంకటరెడ్డి,ఉప సర్పంచ్ గంగి యాదయ్య, ఎస్ బి సి ఛానల్ ప్రొప్రైటర్ దామోదర్, కేసారం సర్పంచ్ రమేష్,అంబేడ్కర్ సంఘం సీనియర్ నాయకులు బురాన్ నర్సింహులు,చేవెళ్ల మండల అంబేడ్కర్ సంఘం అధ్యక్షులు ప్రవీణ్,గౌడ సంఘం అధ్యక్షుడు రాఘవేందర్, న్యాయవాదులు చంద్ర శేఖర్,సత్యం, మాస్టర్ కీ టీవీ రిపోర్టర్స్ శేఖర్, నరేందర్ లతో కలిసి మాస్టర్ కీ టీవీ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాస్టర్ కీ టీవీ ఛానల్ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసారు.. మాస్టర్ కీ టీవీ ఛానల్ ఇదే విధంగా ముందుకు వెళ్తూ ప్రజల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెల్తు సమాజానికి ఈ ఛానల్ ద్వారా తమ వంతు కృషి చేయాలి అని అన్నారు.
Share this on your social network: