అడిషనల్ కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేసిన ఉప్పరిగూడ గ్రామస్తులు

Published: Tuesday October 18, 2022

ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 17ప్రజాపాలన ప్రతినిధిఇబ్రహీంపట్నం పెద్ద చెరువు నిండి పెద్ద ఎత్తున అలుగు పారుతున్న వలన సాగర్ హైవే నుండి ఉప్పరిగూడ గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచి పోవడం వలన ఇబ్రహీంపట్నం మరియు హైదరాబాద్ వెళ్లడానికి గ్రామ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. కావున ఉప్పరిగూడ గేటు వద్ద రాకపోకలకు వీలుగా బ్రిడ్జి నిర్మాణం చేయగలరని ఈరోజు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ తిరుపతి రావు కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బీ ఆర్ ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షులు బోసుపల్లి విరేష్ కుమార్ , మడుపు వెంకటేష్ , ఓరుగంటి రాములు , బుట్టి మహేందర్ ముదిరాజ్ ( JR. KCR ), కొంగరి శ్రీకాంత్ , నరాల జంగయ్య , నర్కుడి ప్రశాంత్ కుమార్ పాల్గొనడం జరిగింది.