ఉప్పల్ డివిజన్లో దశల వారీగా అభివృద్ధి పనులు కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి
Published: Friday October 08, 2021
మేడిపల్లి, అక్టోబర్ 07, (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ డివిజన్లో దశల వారీగా అభివృద్ధి పనులను చేపడుతూ సమస్యలను పరిష్కరించనున్నట్టుగా కార్పొరేటర్ మందముళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. డివిజన్లోని సెవెన్ హిల్స్ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను గురువారం రజితపరమేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీలవాసులు డ్రైనేజీ సమస్యలను కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి దృష్టికి తెచ్చారు. సకాలంలోనే డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయనున్నట్టుగా తెలిపారు. కార్యక్రమంలో ఏఈ వసంత, కాలనీ అధ్యక్షుడు శ్రీధర్ గుప్త, మధుకర్ రెడ్డి, భాను, శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: