ఉప్పల్ డివిజన్లో దశల వారీగా అభివృద్ధి పనులు కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి

Published: Friday October 08, 2021
మేడిపల్లి, అక్టోబర్ 07, (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ డివిజన్లో దశల వారీగా అభివృద్ధి పనులను చేపడుతూ సమస్యలను పరిష్కరించనున్నట్టుగా కార్పొరేటర్ మందముళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. డివిజన్లోని సెవెన్ హిల్స్ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను గురువారం రజితపరమేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీలవాసులు డ్రైనేజీ సమస్యలను కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి దృష్టికి తెచ్చారు. సకాలంలోనే డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయనున్నట్టుగా తెలిపారు. కార్యక్రమంలో ఏఈ వసంత, కాలనీ అధ్యక్షుడు శ్రీధర్ గుప్త, మధుకర్ రెడ్డి, భాను, శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.